హౌతీ డ్రోన్ని కూల్చేసిన సౌదీ
- May 25, 2019సౌదీ అరేబియా:బాంబు అమర్చిన డ్రోన్ని హౌతీ తీవ్రవాదులు సౌదీలోని ఎయిర్ పోర్ట్పైకి సంధించగా, దాన్ని సౌదీ అరేబియా రక్షణ దళాలు కూల్చేశాయి. నజ్రాన్ ఎయిర్ పోర్ట్ని టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఈ డ్రోన్ని ప్రయోగించినట్లు సౌదీ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ ఎయిర్ ఫోర్స్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మల్కి ఈ విషయాన్ని వెల్లడించారు. 72 గంటల్లో నజ్రాన్ ఎయిర్ పోర్ట్పై ఇది మూడో దాడి యత్నమని ఆయన వివరించారు. రెబల్స్ నజ్రాన్లోని సివిలియన్ ఇన్స్టాలేషన్పై దాడి చేశారని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని ఆయన వివరించారు. గత వారంలో ఆయిల్ ఎస్సెట్స్పై దాడిని యెమెన్ తీవ్రవాద దళాలు సమర్థించుకున్నాయని, దాడి తామే చేఉసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు టుర్కి అల్ మల్కి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..