8 మంది మృతికి కారణమైన కువైటీ టీనేజ్ డ్రైవర్ అరెస్ట్
- May 29, 2019కువైట్: చిన్న రోడ్డు ప్రమాదం జరగడంతో, అక్కడ గుమికూడి బాధితులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపైకి మరో వాహనం వేగంగా దూసుకురావడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కువైట్లో చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. కబాద్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గుర్తించి, 17 ఏళ్ళ కువైటీ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది చనిపోయగా అందులో ముగ్గురు కువైటీలు, ముగ్గురు సౌదీలు ఓ బెడౌన్ మరియు ఇద్దరు ఓ గుర్తు తెలియని వ్యక్తి వున్నారు. పలువురు గాయాల బారిన కూడా పడ్డారు. అరెస్ట్ చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు వుంటాయని అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డుపై ప్రజలు గుమి కూడడడం మంచిది కాదనీ, అదే సమయంలో రోడ్డుపై పరిమిత వేగంతో మాత్రమే వాహనాలు నడపాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు