200 మంది కార్మికులకు ఇఫ్తార్ ఇచ్చిన చిన్నారులు
- June 01, 2019అబుధాబి:కొంతమంది చిన్నారులు గ్రూప్గా ఏర్పడి, ముస్సాఫాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో కార్మికులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. 20 మంది చిన్నారుఉల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అందులోనూ మెజార్టీ చిన్నారులు నాన్ ముస్లింలు కావడం మరో విశేషం. ఇండియన్ సోషల్ అండ్ కల్చర్ సెంటర్ (ఐఎస్సి)కి చెందిన చిన్నారుల విభాగం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ అనుశ్రీ, వైస్ ప్రెసిడెంట్ హరిశంకర్ మరియు చీఫ్ కో-ఆర్డినేటర్ పూజ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. సిటీ నుంచి 90 నిమిషాల బస్ జర్నీ తర్వాత లేబర్ అకామడేషన్కి చేరుకున్నామని, మాస్క్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది తమకు చాలా గొప్ప అనుభవమనీ చిన్నారులు చెప్పారు. వారితో కలిసి ఫాస్టింగ్ని ముగించామని చిన్నారులు వివరించారు. పేరెంట్స్ డైరెక్షన్లో పిల్లలు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల లేబరర్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..