ఇరాన్ను సమర్ధిస్తే చమురు సరఫరాలు కట్..!
- June 02, 2019మక్కా:గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులతో ప్రపంచదేశాలకు చమురు సరఫరాలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం వుందని సౌదీ రాజు సల్మాన్ హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న ఒఐసి దేశాల సదస్సులో శనివారం ఆయన మాట్లాడుతూ ఇరాన్ను సమర్ధిస్తే చమురు సరఫరాలు నిలిచిపోయే అవకాశం వుందని ఆయన మిత్రదేశాలకు సూచించారు. ఇరాన్కు వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవలి కాలంలో ఎమిరేట్స్ సముద్ర తీరంలో జరిగిన దాడుల్లో సౌదీకి చెందిన చమురు నౌకలు దెబ్బతినటంతో ఇరాన్-సౌదీ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తమ ప్రమేయం ఏమీలేదని ఇరాన్ సౌదీకి గట్టిగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఓఐసి సదస్సు ముగింపు కార్యక్రమంలో రాజు సల్మాన్ మాట్లాడుతూ ఈ ఉగ్రవాద దాడులు కేవలం సౌదీకి మాత్రమే కాక గల్ఫ్ప్రాంత దేశాలకు, ప్రపంచ చమురు సరఫరాలకు వ్యతిరేకంగా జరిగినట్లు తాము భావిస్తున్నామన్నారు. తమకు ఎదురయ్యే ముప్పులను, విచ్ఛిన్న కార్యకలాపాలను తాము సమర్ధవంతంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్