ఈజిప్టులో ఉగ్రదాడి..
- June 05, 2019
ఈజిప్ట్:సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్ పాయింట్ వద్ద బుధవారం ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. రంజాన్ సందర్భంగా ఈల్ అరీష్ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ రోజు ఉదయం చెక్ పాయింట్ వద్ద ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు.
ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. చెక్ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర సినాయీ ఆధారిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో ఈజిప్ట్ బలగాలు కొన్నేళ్లుగా పోరాడుతున్నాయి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!