వచ్చే ఏడాదికల్లా 'దుబాయ్ మాల్' బ్రిడ్జ్ రెడీ
- January 03, 2016
అల్ ఖాయిల్ రోడ్ నుంచి ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ని కనెక్ట్ చేసే 120 మిలియన్ దిర్హామ్ల ఖర్చుతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం వచ్చే ఏడాదికల్లా పూర్తవుతుందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వర్గాలు వెల్లడించాయి. రెండు లేన్లుగల ఈ బ్రిడ్జ్ ఇండివిడ్యువల్ పిల్లర్స్తో, దుబాయ్ వాటర్ కెనాల్ మీదుగా నిర్మితం కానుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం అవసరమైన మేర ఇతర రోడ్లను విస్తరించడం, డైవర్షన్ సిస్టమ్ని అందుబాటులోకి తీసుకురావడం, వీటితోపాటుగా ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, వాట్, సీవేజ్ మరియు టెలికమ్యూనికేషన్ లైన్స్కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రస్ అల్ ఖోర్ రోడ్ ఇంటర్సెక్షన్ వద్ద ప్రారంభమయ్యే ఈ రోడ్డు, ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ అప్పర్ డెక్ వరక విస్తరించేలా నిర్మాణం చేపట్టారు. దుబాయ్ మాల్కి సంబంధించిన పార్కింగ్ టెర్మినల్కి కనెక్ట్ అయ్యేలా బ్రిడ్స్ నుంచి ఎంట్రీ పాయింట్ని ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించడం, తక్కువ సమయంలో ఫైనాన్షియల్ సెంటర్కి చేరుకునేలా వాహనదారులకు మంచి ప్రయాణాన్ని అందించడం కోసమే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







