మరో 24 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
- June 08, 2019
మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 9న అలప్పుళా, కొల్లాం జిల్లాలు, 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈనేపథ్యంలో ఆప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని .. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారాదని హెచ్చరించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో మరో వారం రోజల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ , విదర్భ , ఉత్తరప్రదేశ్ల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 3,4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..