అదృశ్యమైన విమాన శకలాలు లభ్యం
- June 11, 2019
ఎనిమిది రోజుల క్రితం అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన AN-32 విమానం శకలాలను గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సయాంగ్ జిల్లాలో విమానం శకలాలు లభ్యం అయ్యాయి. కొద్ది రోజులుగా ఐఏఎఫ్ తోపాటు ఆర్మీ కూడా అదృశ్యమైన విమానం కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.గాలింపు చర్యల్లో పాల్గొన్న MI-17 హెలికాప్టర్ సియాంగ్ జిల్లాలో విమాన శకలాలను గుర్తించింది.
13మంది సిబ్బందితో జూన్-3,2019న మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హత్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన AN-32 అరుణాచల్ ప్రదేశ్ లోని మెచుకా వ్యాలీలో ల్యాండింగ్ కావాల్సివుంది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1 గంటకు రాడార్ తో సంబంధాలు తెగిపోయి విమానం కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
విమాన ఆచూకీ కోసం ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సుకోయ్ -30, సీ-130 జెట్ విమానాలతో ఆపరేషన్ కొనసాగింది. గాలింపు చర్యల్లో భాగంగా ఐఏఎఫ్ ఎంఐ-17 హెలికాప్టర్ తో ఏఎన్ -35 విమానం కోసం వెతుకుతుండగా సియాంగ్ జిల్లాలో విమాన శకాలను గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..