2 మిలియన్ల దిగువకు చేరుకున్న వలసదారుల సంఖ్య
- June 12, 2019మస్కట్: సుల్తానేట్లో వలసదారుల సంఖ్య 2 మిలియన్ దిగువకు చేరుకుంది. రెండేళ్ళలో ఇది తొలిసారి అని ఎన్సిఎస్ఐ పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, దేశంలో 2,650,418 మంది ఒమనీయులు వుండగా, వలసదారుల సంఖ్య 1,997, 763. మొత్తం దేశ జనాభాలో 43 శాతం వలసదారులున్నారు. ఏప్రిల్ 2016 తర్వాత వలసదారుల సంఖ్య ఇదే అత్యల్పం. ఒమనైజేషన్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత క్రమక్రమంగా దేశంలో వలసదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018లో ఒమనైజేషన్ క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. సుమారు 87 జాబ్స్కి సంబంధించి ఆరు నెలల వీసా బ్యాన్ అమలు అవుతోంది. ప్రతి ఆరు నెలలకోసారి ఈ బ్యాన్ పొడిగింపబడుతోంది. ఒమనైజేషన్ పాలసీ కారణంగా ఇటీవల 60,000 మంది ఒమనీయులకు ఉద్యోగాలు వచ్చాయి.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు