గాల్లో బాంబులా పేలిన స్పైస్జెట్ టైరు..దుబాయ్ విమానం అత్యవసర ల్యాండింగ్
- June 13, 2019
దుబాయి : స్పైస్ జెట్కు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే టైరు పేలిపోయింది. దుబారు నుంచి జైపూర్ బయల్దేరిన ఈ విమానం సగం ప్రయాణం చేశాక విమానం టైర్లలో ఒకటి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మొత్తానికి ఏదో జరిగిందని భావించిన స్పైస్ జెట్ సిబ్బంది, విమానానికి సమస్య ఏర్పడిందని జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అత్యవసర సమాచారం అందించారు. దాంతో, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పైస్ జెట్ విమానంలో 198 మంది ఉన్నారు. ఎట్టకేలకు విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందికి దించారు. వెంటనే ఫ్లయిట్ లో ఉన్న అందరినీ కిందికి దింపేశారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించగా విమానం టైరు పేలిపోయి కనిపించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబారు తిరిగి వెళ్లాల్సి ఉండగా, మరమ్మతుల నిమిత్తం సర్వీసు రద్దు చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసార 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..