ఇల్లీగల్ ట్యాక్సీ: 3,000 జరీమానా, 24 ట్రాఫిక్ పాయింట్స్
- June 14, 2019
అబుధాబి: ఇల్లీగల్ ట్యాక్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ పేర్కొంది. 2019 తొలి క్వార్టర్లో 1,573 ఇల్లీగల్ ట్యాక్సీలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్తో కలిసి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి చెందిన అధికారులు అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి ఇల్లీగల్ ట్యాక్సీలను పట్టుకోగలిగారు. ఇల్లీగల్ ట్యాక్సీలకు 3,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, వారిపై 24 ట్రాఫిక్ పాయింట్లు కూడా విధిస్తామని అబుదాబీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అవాద్ బిన్ మహిరుమ్ చెప్పారు. ఇల్లీగల్ ట్యాక్సీలు నిర్వహిస్తున్నవారిలో కొందరికి లైసెన్సులు కూడా లేవని ఆయన వివరించారు. ఎక్కువగా లేబరర్స్ ఈ ఇల్లీగల్ ట్యాక్సీలను తక్కువ ధర కారణంగా ఎంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆసియాకి చెందిన వ్యక్తులే ఎక్కువగా వీటిని నడుపుతున్నారని చెప్పారు కల్నల్ ముబారక్ అవాద్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







