ఇల్లీగల్ ట్యాక్సీ: 3,000 జరీమానా, 24 ట్రాఫిక్ పాయింట్స్
- June 14, 2019
అబుధాబి: ఇల్లీగల్ ట్యాక్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ పేర్కొంది. 2019 తొలి క్వార్టర్లో 1,573 ఇల్లీగల్ ట్యాక్సీలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్తో కలిసి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి చెందిన అధికారులు అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి ఇల్లీగల్ ట్యాక్సీలను పట్టుకోగలిగారు. ఇల్లీగల్ ట్యాక్సీలకు 3,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, వారిపై 24 ట్రాఫిక్ పాయింట్లు కూడా విధిస్తామని అబుదాబీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అవాద్ బిన్ మహిరుమ్ చెప్పారు. ఇల్లీగల్ ట్యాక్సీలు నిర్వహిస్తున్నవారిలో కొందరికి లైసెన్సులు కూడా లేవని ఆయన వివరించారు. ఎక్కువగా లేబరర్స్ ఈ ఇల్లీగల్ ట్యాక్సీలను తక్కువ ధర కారణంగా ఎంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆసియాకి చెందిన వ్యక్తులే ఎక్కువగా వీటిని నడుపుతున్నారని చెప్పారు కల్నల్ ముబారక్ అవాద్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







