ఇల్లీగల్ ట్యాక్సీ: 3,000 జరీమానా, 24 ట్రాఫిక్ పాయింట్స్
- June 14, 2019
అబుధాబి: ఇల్లీగల్ ట్యాక్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అబుదాబీ పోలీస్ పేర్కొంది. 2019 తొలి క్వార్టర్లో 1,573 ఇల్లీగల్ ట్యాక్సీలను సీజ్ చేయడం జరిగిందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీస్తో కలిసి ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి చెందిన అధికారులు అండర్ కవర్ ఆపరేషన్లు నిర్వహించి ఇల్లీగల్ ట్యాక్సీలను పట్టుకోగలిగారు. ఇల్లీగల్ ట్యాక్సీలకు 3,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, వారిపై 24 ట్రాఫిక్ పాయింట్లు కూడా విధిస్తామని అబుదాబీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ముబారక్ అవాద్ బిన్ మహిరుమ్ చెప్పారు. ఇల్లీగల్ ట్యాక్సీలు నిర్వహిస్తున్నవారిలో కొందరికి లైసెన్సులు కూడా లేవని ఆయన వివరించారు. ఎక్కువగా లేబరర్స్ ఈ ఇల్లీగల్ ట్యాక్సీలను తక్కువ ధర కారణంగా ఎంచుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆసియాకి చెందిన వ్యక్తులే ఎక్కువగా వీటిని నడుపుతున్నారని చెప్పారు కల్నల్ ముబారక్ అవాద్.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









