ఘర్షణల్లో నిర్వాసితులైన 18 వేల కుటుంబాలు
- June 14, 2019
ట్రిపోలీ దక్షిణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు, పోరాటాలలో దాదాపు 18 వేలకు పైగా కుటుంబాలు (94 వేల మంది) నిర్వాసితులయ్యాయని ఐరాసకు చెందిన వలస వ్యవహారాల అంతర్జాతీయ సంస్థ (ఐఒఎం) వెల్లడించింది. నిర్వాసితుల్లో దాదాపు 48 శాతం మంది 18 ఏళ్లలోపు చిన్నారులేనని, వీరిలో దాదాపు 3,900 మందికి పైగా నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న శరణార్థి శిబిరాలలో నివశిస్తున్నారని ఐఒఎం తన ప్రకటనలో వివరించింది. ఘర్షణల సమీప ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటికీ ముప్పు పొంచి వున్నదని ఈ సంస్థ హెచ్చరించింది. మార్షల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ గత ఏప్రిల్ 4న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో సాయుధ ఘర్షణలు ప్రారంబమయ్యాయి. అప్పటి నుండి ట్రిపోలీ దక్షిణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!