ఘర్షణల్లో నిర్వాసితులైన 18 వేల కుటుంబాలు
- June 14, 2019
ట్రిపోలీ దక్షిణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఘర్షణలు, పోరాటాలలో దాదాపు 18 వేలకు పైగా కుటుంబాలు (94 వేల మంది) నిర్వాసితులయ్యాయని ఐరాసకు చెందిన వలస వ్యవహారాల అంతర్జాతీయ సంస్థ (ఐఒఎం) వెల్లడించింది. నిర్వాసితుల్లో దాదాపు 48 శాతం మంది 18 ఏళ్లలోపు చిన్నారులేనని, వీరిలో దాదాపు 3,900 మందికి పైగా నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తున్న శరణార్థి శిబిరాలలో నివశిస్తున్నారని ఐఒఎం తన ప్రకటనలో వివరించింది. ఘర్షణల సమీప ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటికీ ముప్పు పొంచి వున్నదని ఈ సంస్థ హెచ్చరించింది. మార్షల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ గత ఏప్రిల్ 4న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించటంతో సాయుధ ఘర్షణలు ప్రారంబమయ్యాయి. అప్పటి నుండి ట్రిపోలీ దక్షిణ ప్రాంతంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు కొనసాగుతూనే వున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







