విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు.. టీడీపీ వర్గాల్లో కలకలం..
- June 14, 2019
గన్నవరం విమానాశ్రయంలో మాజీ సీఎం చంద్రబాబును భద్రతా సిబ్బంది తనిఖీ చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును తనిఖీ చేశారు. చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయంలోకి అనుమతించలేదు. ఎయిర్పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్లోనే చంద్రబాబు ప్రయాణించారు. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రతలో ఉన్నా.. చంద్రబాబుకు ప్రత్యేక వాహనాన్ని అధికారులు కేటాయించలేదు. ఏపీలోనూ చంద్రబాబు కాన్వాయ్కి పైలెట్ క్లియరెన్స్ను తొలగించారు. ఐతే.. ట్రాఫిక్లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతకు ముప్పని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









