బస్సులో ఊపిరాడక చనిపోయిన చిన్నారి
- June 17, 2019దుబాయ్లో ఓ చిన్నారి బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. సెంటర్ ఫర్ మొమొరైజింగ్ కురాన్కి చెందిన బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ కోజ్ ఏరియాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, బాలుడు బస్సులో వుండిపోయిన విషయాన్ని బస్ డ్రైవర్, సూపర్వైజర్ గుర్తించకుండానే డోర్స్ క్లోజ్ చేయడంతో 9 గంటలపాటు బస్సులో చిన్నారి వుండిపోయాడు. ఈ క్రమంలో బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్నీ, సూపర్వైజర్నీ ప్రశ్నిస్తున్నారు. బాలుడ్ని భారతదేశంలోని కేరళకు చెందిన మొహమ్మద్ ఫర్హాన్గా గుర్తించారు. తన సోదరి పెళ్ళి కోసం చిన్నారి తన కుటుంబంతో కలిసి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి తండ్రి ఫైజల్ కెపి అనీ కేరళకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్