సేదతీరేందుకు యూరప్ వెళ్లిన చంద్రబాబు ఫ్యామిలి
- June 19, 2019
అమరావతి: ఈ తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఆయన ప్రత్యేక లేఖలో తెలిపారు. నేడు ఢిల్లీలో జరగనున్న పార్టీల అధ్యక్షుల సమావేశానికి తాను హాజరు కాబోవడం లేదని, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం, తాను విదేశాలకు వెళ్లాల్సి వుందని అన్నారు ఈ సమావేశంపై తమ పార్టీ వైఖరిని తెలుపుతూ ఓ లేఖను టీడీపీ ఎంపీలకు చంద్రబాబు ఇవ్వాగా, వారు దీన్ని నేడు ప్రహ్లాద్ జోషికి అందించనున్నారు. తన కార్యక్రమం ముందుగా ఖరారై పోయిందని, ఆ తరువాతే సమావేశపు ఆహ్వానం తనకు అందిందని పేర్కొన్న చంద్రబాబు, అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖను పంపుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ నెల 24 వరకూ చంద్రబాబు విదేశీ పర్యటన కొనసాగనుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!