ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం, 30మంది మృతి
- June 21, 2019ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్గిపుల్లల కర్మాగారంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. నార్త్ సుమత్రా ప్రావిన్స్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో కనీసం 30 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద తీవ్రత భారీగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడికి చేరుకొని క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటామని అధికారులు తెలిపారు. భద్రతా ప్రమాణాలను అంతగా పట్టించుకోని ఇండోనేషియాలో అగ్నిప్రమాదాలు కొత్తేమీ కాదు. 2017లో జకార్తా సమీపంలోని తంగెరాంగ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 47 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర