ట్రంప్తో భేటీ కానున్న మోదీ
- June 26, 2019
భారత్-అమెరికా మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరచడమే లక్ష్యంగా త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జపాన్లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. అంతకముందే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.
రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వీరి భేటీ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై.. ఈ నెల 28న అమెరికా అధ్యక్షుడు ట్రంప్- ప్రధాని మోదీ మరోసారి చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!