కిమ్ ని కలిసిన ట్రంప్
- June 30, 2019
ప్రపంచదేశాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ లు కలుసుకున్నారు. దక్షిణ, ఉత్తర కొరియా సరిహద్దులోని సైనిక రహిత గ్రామమైన పన్మున్ జోన్ గ్రామంలో ఇరువురు నేతలు కలిశారు. ట్రంప్ ను కలుసుకోవడం సంతోషంగా ఉందని కిమ్ అనగా… మా ఇద్దరిమధ్య గొప్ప స్నేహబంధం ఉందని, ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ట్రంప్.
ఈ సందర్భంగా సరిహద్దుకు అటుగా ఉన్న ఉత్తరకొరియా భూభాగంలోకి కిమ్ తో కలిసి ట్రంప్ అడుగు పెట్టారు. ఈ సమావేశంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కూడా పాల్గొని కిమ్ తో కరచాలనం చేశారు. మా సమావేశం దురదుష్టకరమైన గతాన్ని తొలగించి కొత్త భవిష్యతకు నాందిగా నిలుస్తుందని కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా మూడు దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా కనిపించారు. ఇది చారిత్రక సమావేశమని పరిశీలకులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!