దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: చెరో మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఇద్దరు భారతీయులు
- July 09, 2019దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ర్యాఫిల్లో ఇద్దరు భారతీయులు చెరో 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. ఇందులో ఒకరు జయా గుప్తా కాగా, ఆమె వయసు 71 ఏళ్ళు. గత ఇరవయ్యేళ్ళుగా ఆమె టిక్కెట్ కొనుగోలు చేస్తూనే వున్నారు. ఇన్నాళ్ళకు ఆమెకు అదృష్టం వరించింది. పూణేలో వుంటోన్న తన తల్లిని కలిసేందుకు మే 10న ఇండియాకి ఆమె వెళ్ళగా, ఈ క్రమంలో ఆమె కొనుగోలు చేసిన టిక్కెట్కి బహుమతి దక్కింది. టిక్కెట్ కొనడం తనకు హాబీ అనీ, ఎప్పుడూ తనకు బహుమతి తగల్లేదనీ, ఇది ఊహించని విషయమని ఆమె చెప్పారు. మరోపక్క, 37 ఏళ్ళ రవి రామ్చంద్ కూడా 1 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు. 14 ఏళ్ళుగా దుబాయ్లో వుంటోన్న రవి రామ్చంద్, గార్మెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నారు. గత పదేళ్ళుగా ఆయన కూడా టిక్కెట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈద్ సెలవుల సందర్భంగా క్రొయేషియాకి వెళుతూ లక్కీ టిక్కెట్ని కొనుగోలు చేసినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక