తిరుమల:రాష్ట్రపతి దంపతులకు వేదపండితుల ఆశీర్వచనాలు
- July 14, 2019తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఆలయ సంప్రదాయాల ప్రకారం రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు.. స్వామివారి దర్శనాన్ని దగ్గరుండి జరిపించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతి దంపతులకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు టీటీడీ అధికారులు.
రాష్ట్రపతి దంపతులతో పాటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్.. శ్రీవరాహ స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో రామ్ నాథ్ కోవింద్ తిరుపతి విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు బయల్దేరుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో షార్ లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి తర్వాత జరగనున్న చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అనంతరం తిరిగి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్