వంట విషయమై తగాదా: రూమ్ మేట్పై దాడి
- July 16, 2019
ఆసియాకి చెందిన వలస కార్మికుడొకరు రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరయ్యారు. రూమ్ మేట్తో వంట విషయమై తలెత్తిన గొడవ కారణంగా నిందితుడు, తన రూమ్మేట్పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి కారణంగా బాధిత రూమ్ మేట్ చెయ్యికి తీవ్ర గాయమై, శాశ్వత వైకల్యం సంభవించింది. సలోనా వంటకం విషయమై ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేయగా, తనను వంట విషయమై అవమానించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు. అయితే బాధిత వ్యక్తి మాత్రం, తాను అవమానించలేదని పేర్కొన్నాడు. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!