దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విద్యుత్ సమస్య
- July 16, 2019దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చెందిన మూడో టెర్మినల్లో 30 నిమిషాల పాటు విద్యుత్ సమస్య తలెత్తింది. అయితే, ఈ సమస్య కారణంగా ఎయిర్పోర్ట్ ఆపరేషన్కి ఎలాంటి సమస్యలూ రాలేదు. ఉదయం 11.04 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అధికార ప్రతినిథి వెల్లడించారు. 30 నిమిషాల్లోనే సమస్యను సరిదిద్దామని చెప్పారు. అయితే, ఏసీ యూనిట్స్ షట్ డౌన్ అవడంతో పలువురు ప్రయాణీకులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్నారు. 1960లో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. సుమారు 88.2 మిలియన్ ప్రయాణీకులు ఏడాదిలో ఈ విమానాశ్రయం నుంచి ప్రయాణిస్తుంటారు. 100 ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 240 డెస్టినేషన్స్కి తమ సేవల్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్