ప్రభాస్ అభిమానులు ఇంకొన్ని రోజులు వేచిఉండక తప్పేట్టులేదు!
- July 17, 2019'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 'సాహో' వెనక్కి వెళ్లడంతో శర్వానంద్ 'రణరంగం', అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15కి వచ్చాయి. ఉన్నట్టుండి రెండు సినిమాల విడుదల తేదీలు మంగళవారం ప్రకటించడంతో ప్రేక్షకుల్లో, పరిశ్రమలో 'సాహో'కి పోటీగా వస్తున్నారేంటి? అని చర్చ మొదలైంది. ఆరాలు తీయగా 'సాహో' వాయిదా పడుతుందని తెలిసి ఆగస్టు 15పై కర్చీఫ్ వేశారని తెలిసింది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ 'రణరంగం'కు మంచి డేట్ దొరికింది. అయితే... ప్రభాస్ అభిమానులకు మాత్రం వాయిదా నిర్ణయం మింగుడు పడటం లేదు. దర్శకుడు సుజీత్, యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..