నేటి నుంచి ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు
- July 17, 2019సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే.. బ్రేక్ సమయాల్లో ఇచ్చే.. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు.
అలాగే. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని కూడా వివరించారు. ఈరోజు నుంచే వాటిని రద్దు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక పరమైన అంశాలను సరిచేసి మరో రెండు మూడు రోజుల్లో అధికారులు అమలు చేస్తారని కూడా సుబ్బారెడ్డి వివరించారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..