కులభూషణ్ పై ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నా - పాక్ ప్రధాని
- July 19, 2019ఇస్లామాబాద్ : కుల్భూషణ్ జాదవ్ కేసులో బుధవారం అంతర్జాతీయ న్యాయస్థానం ( ఐసిజెే) ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఐసిజె తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. జాదవ్ను నిర్దోషిగా తేల్చినందుకు, రిలీజ్ చేయమని ఆదేశించనందుకు హర్షిస్తున్నట్టు ఇమ్రాన్ తెలిపారు. పాకిస్థాన్ ప్రజలకు వ్యతిరేకంగా జాదవ్ నేరాలకు పాల్పడ్డారని, ఆ కేసుల్లో అతను దోషిగా ఉన్నాడని ఇమ్రాన్ ఆరోపించారు. చట్టం ప్రకారమే పాక్ ఈ కేసులో ముందుకు వెళ్తుందని ఇమ్రాన్ ఖాన్ తన ట్వీట్ లో తెలిపాడు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన భారత నౌకాదళ విశ్రాంత అధికారి జాదవ్ను పాక్ మిలిటరీ కోర్టు దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భారత్కు అనుకూలంగా బుధవారం అంతర్జాతీయ కోర్టు రూలింగ్ ఇచ్చింది. జాదవ్కి పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ కోర్టు నిలిపివేసింది. జాదవ్ ఉరిశిక్షపై మరోసారి పరిశీలించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది. భారత రాయబార కార్యాలయ అధికారులను కలుసుకునేందుకు జాదవ్కు అవకాశం ఇవ్వాలని చెప్పింది. ఈ కేసులో 16 మంది న్యాయమూర్తుల్లో 15మంది భారత్ వాదనకు మద్దతు పలికారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు