జంపింగ్ రెడ్ లైట్స్: 4,000 మందికి పైగా మోటరిస్టులకు జరీమానా
- July 19, 2019అబుదాబీ: వేలాది మంది వాహనదారులకు ఈ ఏడాది అప్పుడే జరీమానాల్ని విధించారు ట్రాఫిక్ అధికారులు. రెడ్ లైట్ సిగ్నల్ జంపింగ్కి సంబంధించి 4,367 మంది వాహనదారులకు జరీమానాలు విధించినట్లు అబుదాబీ పోలీసులు వెల్లడించారు. తొలి ఆరు నెలల్లో ఈ ఉల్లంఘనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, రెడ్ సిగ్నల్ లైట్ జంప్ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మోటరిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ లైట్ జంప్ చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారుల భద్రత కోసమే ట్రాఫిక్ రూల్స్ వున్నాయని, వాటిని పాటించాల్సి వుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు