అడ్డంగా బుక్కైన ప్రియాంకా చోప్రా
- July 22, 2019
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వయసు ఇంకో సంవత్సరం పెరిగింది. జులై 18న ఆమె 37వ ఏట అడుగుపెట్టింది. తన పుట్టినరోజు వేడుకలను అమెరికాలోని మియామి నగరంలో జరుపుకుంది. మియామిలోని సముద్రంలో యాచ్(పడవ)పై ఆమె పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకల్లో భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా, ఇతర సన్నిహితులతో కలిసి ప్రియాంక ఎంజాయ్ చేసింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, వీటిలో ఒక ఫొటో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రోలింగ్కు దారితీసింది.
ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా సిగరెట్ కాల్చుతోంది. ఆమెతోపాటు భర్త నిక్ జోనస్, తల్లి మధు చోప్రా సిగార్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫొటోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియాంకను ఒక ఆటాడుకుంటున్నారు. దీనికీ కారణాలున్నాయి..!!
కిందటేడాది ప్రియాంక ఒక అద్భుతమైన సందేశాన్ని దేశ ప్రజలకు ఇచ్చింది. దీపావళి నాడు టపాసులు కాల్చవద్దని ప్రజలను కోరింది. ఈ పండుగ మన జీవితాల్లో వెలుగులను నింపుతుందని.. లడ్డూలు, ప్రేమను పంచుతుందని.. అంతేకానీ, కాలుష్యాన్ని కాదని హితబోధ చేసింది. దీన్ని పట్టుకుని ఇప్పుడు నెటిజన్లు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు. ఇది కాలుష్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు, ఆస్తమాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కిందటేడాది ప్రియాంక నడుం బిగించింది. ఆస్తమాపై ప్రజల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి బ్రాండ్ అంబాసిడర్గా మారి ప్రచారం చేసింది. దీనిలో భాగంగా తనకు 5 ఏళ్ల వయసులోనే ఆస్తమా వచ్చిందని ప్రియాంక చెప్పింది. అయినప్పటికీ, తాను వెనకడుగు వేయకుండా ఈ స్థాయికి ఎదిగానంటూ స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పింది.
ఆ మాటలను ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రియాంక అబద్ధాలకోరు అంటూ తిట్టిపోస్తున్నారు. ఆస్తమా ఉంటే సిగరెట్ ఎలా తాగుతున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, స్మోకింగ్ అంటే తనకు గిట్టదని, యాక్ అని 2010లో ప్రియాంక చేసిన ట్వీట్ను ఇప్పుడు మళ్లీ బయటికి తీశారు. మొత్తానికి ప్రియాంక అడ్డంగా దొరికిపోయింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం