వాట్సాప్ చెల్లింపు సేవలపై స్పష్టత
- July 25, 2019
న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెల్లింపు సేవలు తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది చివరికల్లా పేమెంట్ సేవలను ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ గ్లోబల్ హెడ్ విల్ కాత్కార్ట్ స్పష్టతనిచ్చారు. ఒకసారి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక దేశంలోని వినియోగదారులందరికీ ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ ఎకానమీలో భాగస్వాములు అవుతామని ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తమ మెసేజింగ్ సేవల్లానే సులభంగా డబ్బును ఇతరులకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాట్సాప్కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది.. భారత్లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పటికే దేశంలో పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటివి ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్సాప్ వీటికి పోటీకి రానుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!