మిసైల్ పరీక్షలకు దిగిన నార్త్ కొరియా
- July 26, 2019ఉత్తర కొరియా మరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించింది. రెండు స్వల్పశ్రేణి మిసైళ్లను నార్త్ కొరియా పరీక్షించింది. వోన్సన్ పట్టణంలో ఈ పరీక్ష జరిగింది. సుమారు 430 కిలోమీటర్లు ప్రయాణించిన మిస్సైళ్లు.. తూర్పు సముద్రంలో పడినట్లు సమాచారం. ఐతే, ఆ క్షిపణులు జపాన్ జలాల్లోకి రాలేదని జపాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వచ్చేనెలలో దక్షిణ కొరియా-అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. సైనిక ప్రదర్శనను ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా-దక్షిణ తీరుపై మండిపడుతున్న నార్త్ కొరియా, మిసైల్ పరీక్షలకు దిగింది. ఆ జంట మిస్సైళ్లు K.N-23S అయి ఉంటాయని రక్షణవర్గాలు పేర్కొన్నాయి. K.N-23S క్షిపణులు అణ్వాయుధాలను మోసుకు వెళ్లగలవని సమాచారం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ