సౌదీ అరేబియా:'ఎబోలా' భయంతో వీసాలు రద్దు
- July 29, 2019రియాద్: కాంగో దేశంలో 'ఎబోలా వైరస్' వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంతో ఆ దేశానికి చెందిన హజ్ యాత్రికుల వీసాలను రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా నిర్ణయించింది. కాంగోలోని కీవు, ఇటూరి ప్రాంతాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉందని ఈ ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్యూఎచ్ఓ) ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకూ దాదాపు 1700 మంది మరణించినట్టు కాంగో ఆర్యోగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంలోనే వచ్చే నెలలో సౌదీ అరేబియాలో జరిగే హజ్యాత్రను సందర్శించడానికి కాంగోలోని చాలామంది ముస్లింలు హజ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశీయులు రావడం వల్ల ఇతర దేశ యాత్రికులు ఎలోబా వైరస్ó సోకే ప్రమాదముందనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ విదేశాంగ మంత్రి అల్ జాజీరా తెలిపారు. కాంగో సహా గునియా, సియార్రాలీన్ , లిబిరియా దేశాలకు చెందిన యాత్రికుల వీసాలను కూడా రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనూ పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్వ్యాప్తి చెంది దాదాపు 11వేల మంది చనిపోయిన సందర్భంలో ఆ దేశీయుల వీసాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే..
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..