ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్

- August 05, 2019 , by Maagulf
ఆర్టికల్ 370 రద్దుపై స్పందించిన పాకిస్తాన్

జమ్ము-కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ స్పందించింది. దీనిపై మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ కురేషీ "ఆర్టికల్ 370 రద్దు చేయడంపై భారత్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడింది. దీని ప్రభావం మొత్తం ప్రాంతంపై చాలా భయానకంగా ఉండచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఈ అంశాన్ని పూర్తిగా చర్చల వైపు తీసుకెళ్లాలని భావించారు. కానీ భారత్ తన నిర్ణయంతో ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. కశ్మీరీలను ఇప్పటికే రాష్ట్రంలో బంధించారు. మేం ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాం. ఇస్లామిక్ దేశాలకు కూడా దీని గురించి చెప్పాం. ముస్లింలు అందరూ కలిసి కశ్మీరీల సంక్షేమం కోసం ప్రార్థనలు చేయాలి. పాకిస్తాన్ పూర్తిగా కశ్మీరీలకు అండగా ఉంటుంది" అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com