పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- August 05, 2019కాపు రిజర్వేషన్ల అంశాన్ని.. జమ్మూ కశ్మీర్ సమస్యతో పోల్చుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ వంటి క్లిష్టమైన సమస్యలకే పరిష్కారం కనుగొంటున్నప్పుడు ఏపీలో కాపు సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. కాపుల రిజర్వేషన్ను జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పోలవరం, అమరావతిలకు పక్కన పెట్టినట్లే కాపు రిజరేషన్ అంశాన్ని పక్కన పెడుతున్నారని ఆరోపించారు.
అటు ఏపీకి ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అడిగిన వారే ఇప్పుడు దానికి తూట్లు పొడుస్తూ.. వ్యతిరేక పంథాలో అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదని అన్నారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు పవన్.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!