కశ్మీర్ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలిపిన భారత్
- August 06, 2019దిల్లీ: కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాసలోని శాశ్వత సభ్య దేశాలకు తెలియజేసింది. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్పై పార్లమెంటులో జరిగబోయే పరిణామాలను వివరించారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయం అయినప్పటికీ.. ఆయా దేశాల ఆసక్తి మేరకు ఈ అంశంపై వారికి వివరించినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్లో సుపరిపాలన, రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధికి అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన దోహదం చేస్తాయని వారికి వివరించారు.
దీనిపై అమెరికా స్పందిస్తూ.. నియంత్రణ రేఖ వెంబడి భాగస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని అమెరికా సూచించింది. అలాగే ఐరాస అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కశ్మీర్పై భారత్ తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంయమనం పాటించాలని సూచించారు.
జమ్ముకశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించారు. ఈ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలియజేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..