సుష్మా స్వరాజ్ మృతిపై బుక్ ఆఫ్ కండోలెన్స్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- August 08, 2019
మస్కట్: ఒమన్లోని ఇండియన్ ఎంబసీ, బుక్ ఆఫ్ కండోలెన్స్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భారత మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుండె పోటుతో ఇటీవల సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎంబసీ ఫేస్ బుక్ ద్వారా 'బుక్ ఆఫ్ కండోలెన్స్' వివరాల్ని వెల్లడించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గొప్ప మానవతా వాది అనీ, ఆమె దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవనీ, విదేశాలకు చెందినవారూ ఆమెను గౌరవిస్తారనీ ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీలోని డిప్లమాటిక్ ఏరియాలో ఆగస్ట్ 7, 8 మరియు 11వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుక్ ఆఫ్ కండోలెన్స్ని ఓపెన్ చేస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







