సుష్మా స్వరాజ్ మృతిపై బుక్ ఆఫ్ కండోలెన్స్ ప్రారంభించనున్న ఇండియన్ ఎంబసీ
- August 08, 2019
మస్కట్: ఒమన్లోని ఇండియన్ ఎంబసీ, బుక్ ఆఫ్ కండోలెన్స్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. భారత మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గుండె పోటుతో ఇటీవల సుష్మా స్వరాజ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎంబసీ ఫేస్ బుక్ ద్వారా 'బుక్ ఆఫ్ కండోలెన్స్' వివరాల్ని వెల్లడించడం జరిగింది. సుష్మా స్వరాజ్ గొప్ప మానవతా వాది అనీ, ఆమె దేశానికి అందించిన సేవలు చాలా గొప్పవనీ, విదేశాలకు చెందినవారూ ఆమెను గౌరవిస్తారనీ ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీలోని డిప్లమాటిక్ ఏరియాలో ఆగస్ట్ 7, 8 మరియు 11వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుక్ ఆఫ్ కండోలెన్స్ని ఓపెన్ చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు