బుర్జ్‌ ఖలీఫాపై భారత్‌, పాక్‌ పతాకాల లైటింగ్‌

- August 17, 2019 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫాపై భారత్‌, పాక్‌ పతాకాల లైటింగ్‌

దుబాయ్‌కి చెందిన ప్రముఖ భవనం బుర్జ్‌ ఖలీఫాపై భారత్‌, మరియు పాకిస్తాన్‌ దేశాల జెండాల వెలుగులు దర్శనమిచ్చాయి. శుక్రవారం కాస్సేపు భారత త్రివర్ణ పతాకం, కాస్సేపు పాకిస్తాన్‌ జెండా దర్శనమివ్వడంతో సందర్శకులు ఆశ్చర్యచకితులయ్యారు.. ఆయా దేశాలకు చెందిన సందర్శకులు తమ తమ జాతీయ పతాకాలు బుర్జ్‌ ఖలీఫాపై దర్శనమివ్వడాన్ని ఆస్వాదించారు. ఆగస్ట్‌ 14న పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం కాగా, ఆగస్ట్‌ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన భవనాల్లో ఒకటైన బుర్జ్‌ ఖలీఫాపై ఈ జెండాల్ని ప్రదర్శించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com