బహ్రెయిన్లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 17, 2019
బహ్రెయిన్:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్లో ఘనంగా జరిగాయి. బహ్రెయిన్లో భారత అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, జాతీయ పతాకం ఆవిష్కరించడంతో ఈ వేడుకలు సీఫ్లోని ఇండియన్ ఎంబసీలో ప్రారంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చదివి విన్పించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఈ వేడుకల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పలు చోట్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఆయా సంస్థలు నిర్వహించాయి. గురుదేవా సోషల్ సొసైటీ వద్ద యాక్టింగ్ ఛైర్మన్ జోసెకుమార్ మరియు జనరల్ సెక్రెటరీ రాజేష్ కనియంపురంబి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, కేరళ సోషల్ మరియు కల్చరల్ అసోసియేషన్ కూడా పంద్రాగస్టు వేదికల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







