బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 17, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్‌:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్‌లో ఘనంగా జరిగాయి. బహ్రెయిన్‌లో భారత అంబాసిడర్‌ అలోక్‌ కుమార్‌ సిన్హా, జాతీయ పతాకం ఆవిష్కరించడంతో ఈ వేడుకలు సీఫ్‌లోని ఇండియన్‌ ఎంబసీలో ప్రారంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ఈ సందర్భంగా అలోక్‌ కుమార్‌ సిన్హా చదివి విన్పించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషియో కల్చరల్‌ ఆర్గనైజేషన్స్‌ ఈ వేడుకల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పలు చోట్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఆయా సంస్థలు నిర్వహించాయి. గురుదేవా సోషల్‌ సొసైటీ వద్ద యాక్టింగ్‌ ఛైర్మన్‌ జోసెకుమార్‌ మరియు జనరల్‌ సెక్రెటరీ రాజేష్‌ కనియంపురంబి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, కేరళ సోషల్‌ మరియు కల్చరల్‌ అసోసియేషన్‌ కూడా పంద్రాగస్టు వేదికల్ని నిర్వహించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com