బహ్రెయిన్లో ఘనంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 17, 2019
బహ్రెయిన్:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు బహ్రెయిన్లో ఘనంగా జరిగాయి. బహ్రెయిన్లో భారత అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా, జాతీయ పతాకం ఆవిష్కరించడంతో ఈ వేడుకలు సీఫ్లోని ఇండియన్ ఎంబసీలో ప్రారంభమయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ఈ సందర్భంగా అలోక్ కుమార్ సిన్హా చదివి విన్పించారు. పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఈ వేడుకల్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పలు చోట్ల భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఆయా సంస్థలు నిర్వహించాయి. గురుదేవా సోషల్ సొసైటీ వద్ద యాక్టింగ్ ఛైర్మన్ జోసెకుమార్ మరియు జనరల్ సెక్రెటరీ రాజేష్ కనియంపురంబి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, కేరళ సోషల్ మరియు కల్చరల్ అసోసియేషన్ కూడా పంద్రాగస్టు వేదికల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







