ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
- August 18, 2019ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్లో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో రోగులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలు అదుపుచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆస్పత్రి వద్ద పొగలు వ్యాపించడంతో అంతా భయంతో పరుగులు తీశారు. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఏడు నుంచి ఎనిమిది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. తొలి అంతస్తులో ప్రమాదం జరగ్గా.. రెండో అంతస్తు దాకా పొగలు వ్యాపించాయి. బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్లోనే చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన వేరే భవనంలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్