ఇండోనేషియా రాజధాని మారింది..కారణమేంటో చదవండి..

- August 18, 2019 , by Maagulf
ఇండోనేషియా రాజధాని మారింది..కారణమేంటో చదవండి..

ఇండోనేషియా దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుంటాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. దీంతో ఆ దేశ రాజధానిని మార్చాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాడు.

ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు ఇండోనేషియా రాజధానిని తరలించనున్నట్టు అయన తెలిపారు. ప్రస్తుత రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక భాగం సముద్రంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరించినట్టు ఆయన తెలిపాడు. అందుకే రాజధానిని జకార్తా నుంచి కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com