ఇండోనేషియా రాజధాని మారింది..కారణమేంటో చదవండి..
- August 18, 2019
ఇండోనేషియా దేశంలో తరచుగా భూకంపాలు, సునామి, వరదలు వస్తుంటాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ ముప్పు ఇండోనేషియాలోని మిగతా ప్రాంతాలకంటే ఆ దేశ రాజధానిపైనే ఎక్కువ ప్రభావం చూపుతున్నది. దీంతో ఆ దేశ రాజధానిని మార్చాలని ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాడు.
ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో ఈ విషయం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు ఇండోనేషియా రాజధానిని తరలించనున్నట్టు అయన తెలిపారు. ప్రస్తుత రాజధాని జకార్తాలో ప్రతి సంవత్సరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతున్నదని.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి జకార్తాలోని మూడింట ఒక భాగం సముద్రంలో మునిగిపోతుందని నిపుణులు హెచ్చరించినట్టు ఆయన తెలిపాడు. అందుకే రాజధానిని జకార్తా నుంచి కాళీమంథన్ కు మార్చబోతున్నట్టు అయన తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!