6-11 తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’..
- August 19, 2019భారత దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. ప్రతియేటా ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vvm.org.in వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 4 లేదా 30 వ తేదీల్లో పరీక్షల నిర్వహణ ఉంటుంది. డిసెంబర్ 15న ఫలితాలు వెలువడతాయి. విద్యార్థులకు ఆరో తరగతి నుంచే సైన్స్, లెక్కల పట్ల ఆసక్తి కలిగిస్తే ఉన్నత చదువుల్లో రాణించి దేశ పురోగతికి పాటుపడుతారన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్ష రాయదలచుకుంటే ఉపాధ్యాయుల సాయంతో వెబ్సైట్లో సిలబస్ సహా అన్ని వివరాలను తెలుసుకోవాలి. ఈ పోటీ పరీక్షలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన సూచనలు, సలహాలు చేయాలి. ‘విద్యార్థులు విద్యార్థి విజ్ఞాన’ మంథన్ పోటీ పరీక్షలో పాల్గొనేలా ప్రోత్సహించాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ