ఘనంగా శిల్పకళా వేదికలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు
- August 21, 2019హైదరాబాద్:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అభిమానుల కోసం ప్రత్యేకించి డ్యాన్సులు, పాటల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ అండ్ గాయనీగాయకుల టీమ్ చిరు క్లాసిక్ మెడ్లీ పాటలతో మైమరిపించారు. జబర్దస్త్ టీమ్ సరదా పార్టిసిపేషన్ ఆకట్టుకుంది. ముఠా మేస్త్రి ల్యాండ్ మార్క్ స్టెప్పులతో జబర్దస్త్ కమెడియన్లు ఆకట్టుకున్నారు. సత్య మాస్టర్ మెడ్లీ డ్యాన్స్ పెర్ఫామెన్స్ మైమరిపించింది. నిర్మాత కం ఎగ్జిబిటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్.. 10వ తరగతిలో మంచి మార్కులు పొందిన విద్యార్థులను సన్మానించారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్,మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..