యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించి ఉపయోగించిన ప్రధాని నరేంద్ర మోడీ
- August 24, 2019
అబుధాబి:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూఏఈలో రుపే కార్డుని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఎమిరేట్స ప్యాలెస్లో రుపే కార్డు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గల్ఫ్లో యూఏఈ ఈ ఘనతను సాధించిన తొలి దేశంగా రికార్డులకెక్కింది. యూఏఈలోని 21 బిజినెస్ గ్రూప్స్ రుపే కార్డుని అనుమతించనున్నాయి. ఇండియన్ స్వీట్స్ని కొనుగోలు చేసేందుకు నరేంద్ర మోడీ తన రుపే కార్డుని తొలిసారిగా యూఏఈలో వినియోగించి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా వుంటే, యూఏఈకి ప్రతి యేటా 3 మిలియన్ ఇండియన్ టూరిస్టులు వస్తుంటారు. రుపే కార్డు అమల్లోకి రావడంతో వారందరికీ మేలు కలుగుతుందని భావిస్తున్నారు. మాస్టర్, వీసా కార్డుల్లానే రుపే కార్డు అతి పెద్ద పేమెంట్ గేట్ వేగా సేవలు అందిస్తోంది. స్వదేశీ కార్డుగా రుపేకి ఇండియాలో విపరీతమైన క్రేజ్ వున్న విషయం తెల్సిందే.



తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







