ముంబై:లాల్బాగ్ గణేషుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు..
- September 02, 2019ముంబై:లాల్బాగ్ గణేషుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు..కోరిన కొర్కెలు ఇట్టే నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఎంత సమయమైనా… క్యూ లైన్లు ఎన్ని కిలోమీటర్లు దాటినా సరే… బొజ్జ గణపయ్య దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తుంటారు. విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటారు.
ఇక ముంబైలో అన్ని విగ్రహాల కంటే లాల్బాగ్ వినాయకుడి విగ్రహామే ఎత్తైనది. సింహాసనంపై ఆసీనుడైన లాల్బాగ్ లంబోదరుడు.. తన రూపంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమా ఆర్ట్ డైరెక్టర్లు రూపొందించే గణేషుడి మండపం కూడా స్పెషల్ ఎట్రాక్షన్గా మారింది. ఈ సారి చంద్రయాన్-2, అంతరిక్షాన్ని ప్రతిభించేలా ఏర్పాటు చేసిన సెట్టింగ్, లేజర్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
1934 నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు లాల్బాగ్ వినాయకుడు. లాల్బాగ్ రాజా సార్వజనిక్ గణేష్ ఉత్సవ్ మండల్ ఏటా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్టిస్తుంది. ఇక గణేష్ విగ్రహ రూపకల్పన బాధ్యతను గత ఎనిమిది దశాబ్దాలుగా కాంబ్లీ కుటుంబమే చూస్తోంది. లాల్బాగ్ భారతదేశంలో ఎత్తైన వినాయక విగ్రహాలలో ఒకటి. అతి పురాతన, ప్రతిష్టాత్మక మండల్లలో ఒకటైన లాల్బాగ్ చా మహారాజ్ను దర్శించడానికి కేవలం ముంబై చుట్టు పక్కల నుంచే దాదాపు కోటి మంది భక్తులు వస్తారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్