ట్యాంకర్ని ఢీకొన్న స్కూల్ బస్: 15 మందికి గాయాలు
- September 09, 2019యూఏఈ: అల్ వర్కాలో గల ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ని స్కూల్ బస్సు ఢీకొన్నట్లు ప్రాథమిక వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్కి కూడా గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పిటల్కి తరలించారు. ఎలాంటి గాయాలూ కాని విద్యార్థుల్ని స్కూల్కి తరలించి, అక్కడ వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇదిలా వుంటే, గాయపడ్డ విద్యార్థులకు కూడా మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..