ట్యాంకర్ని ఢీకొన్న స్కూల్ బస్: 15 మందికి గాయాలు
- September 09, 2019
యూఏఈ: అల్ వర్కాలో గల ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ని స్కూల్ బస్సు ఢీకొన్నట్లు ప్రాథమిక వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్కి కూడా గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పిటల్కి తరలించారు. ఎలాంటి గాయాలూ కాని విద్యార్థుల్ని స్కూల్కి తరలించి, అక్కడ వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇదిలా వుంటే, గాయపడ్డ విద్యార్థులకు కూడా మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







