ట్యాంకర్ని ఢీకొన్న స్కూల్ బస్: 15 మందికి గాయాలు
- September 09, 2019
యూఏఈ: అల్ వర్కాలో గల ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ని స్కూల్ బస్సు ఢీకొన్నట్లు ప్రాథమిక వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్కి కూడా గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పిటల్కి తరలించారు. ఎలాంటి గాయాలూ కాని విద్యార్థుల్ని స్కూల్కి తరలించి, అక్కడ వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇదిలా వుంటే, గాయపడ్డ విద్యార్థులకు కూడా మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







