ట్యాంకర్ని ఢీకొన్న స్కూల్ బస్: 15 మందికి గాయాలు
- September 09, 2019యూఏఈ: అల్ వర్కాలో గల ఓ స్కూల్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దుబాయ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ని స్కూల్ బస్సు ఢీకొన్నట్లు ప్రాథమిక వివరాల్ని బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 15 మందికి గాయాలయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్కి కూడా గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డవారిని రషీద్ హాస్పిటల్కి తరలించారు. ఎలాంటి గాయాలూ కాని విద్యార్థుల్ని స్కూల్కి తరలించి, అక్కడ వారికి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ సిబ్బంది పలు సూచనలు చేశారు. ఇదిలా వుంటే, గాయపడ్డ విద్యార్థులకు కూడా మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్