తగ్గిన పసిడి ధర
- September 14, 2019
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, అమెరికా డాలర్తో పోలిస్తే బలమైన రూపాయి వంటి అంశాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో శుక్రవారం గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.2 శాతం క్షీణతతో రూ.37,650కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర నిలకడగానే ఉంది. భవిష్యత్లో బంగారం ధర పెరిగే అవకాశాలున్నాయని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడుతుండవచ్చని వివరించింది. దేశీ మార్కెట్ విషయానికి వచ్చేసరికి.. బంగారం రేటు తగ్గుదల కలిసొచ్చే అంశమని వివరించింది.
పసిడి పడిపోవడంతో జువెలరీ కొనుగోలు దారుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. ఇక రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని కూడా కొనుగోళ్ల సంఖ్య పెరగవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. గత వారంతో 10గ్రాముల బంగార ధర రూ.39,885 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.2,200లు తగ్గి రూ.37,650కి వస్తుంది. బంగారం ధరలు ఇలా ఉండగా, మరోపక్క వెండి ధర కూడా తగ్గుతూనే ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.2 శాతం క్షీణతతో రూ.47,047కు దిగి వచ్చింది. గత వారం వెండి ధర గరిష్టంగా రూ.51,489 ఉంది. ఇప్పుడు అది దాదాపు 8 శాతం పతనమైంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







