'రాక్షసుడికి' గెస్టవనున్న 'బాహుబలి' & 'కింగ్'
- May 16, 2015
సూర్య కథానాయకుడిగా వెంకటప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్' సినిమా 'రాక్షసుడు' టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకిరానుంది. సూర్య సరసన నయనతార, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కే.ఈ.జ్ఞానవేల్రాజా సమర్పిస్తున్న ఈ సినిమాను మేధా క్రియేషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు, మిరియాల రవీందర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈనెల 18న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లతో పాటు కింగ్ నాగార్జున హాజరుకానున్నారట. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







