'రాక్షసుడికి' గెస్టవనున్న 'బాహుబలి' & 'కింగ్'
- May 16, 2015
సూర్య కథానాయకుడిగా వెంకటప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మాస్' సినిమా 'రాక్షసుడు' టైటిల్తో తెలుగు ప్రేక్షకుల ముందుకిరానుంది. సూర్య సరసన నయనతార, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కే.ఈ.జ్ఞానవేల్రాజా సమర్పిస్తున్న ఈ సినిమాను మేధా క్రియేషన్స్ అధినేతలు మిరియాల రాజాబాబు, మిరియాల రవీందర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఈనెల 18న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్లతో పాటు కింగ్ నాగార్జున హాజరుకానున్నారట. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









