యూఏఈలో గోల్డ్ కార్డ్ పొందిన డా.జులేఖా దౌద్
- September 20, 2019దుబాయ్: యూఏఈ తదితర దేశాల్లో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు ఇచ్చే గోల్డ్కార్డును తొలిసారిగా ఓ భారతీయ మహిళ పొందారు.జులేఖా దౌద్(81) మహారాష్ట్ర లోని నాగపూర్ కి చెందిన వారు.జులేఖా దౌద్ యూఏఈ లో డాక్టర్ గా వృత్తి ప్రారంభించి జులేఖా హాస్పిటల్ని స్థాపించారు.ఈ గోల్డ్కార్డుల విధానాన్ని అమలు చేయడం మొదలెట్టగానే.. తొలి గోల్డ్కార్డును దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న భారత వ్యాపారవేత్తకే ఇచ్చారు. ఇప్పడు కూడా జులేఖా దౌద్ అనే ఓ డాక్టరుకు ఈ కార్డు అందజేశారు. వైద్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం గోల్డ్కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు అమెరికా గ్రీన్కార్డులు ఇస్తుందని తెలిసిందే. ఈ తరహాలోనే తమ దేశంలోని వలసదారులకు కూడా ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!