సీఎం జగన్ రాజీనామా చేయాలి:చంద్రబాబు నాయుడు
- September 22, 2019
అమరావతి:ఏపీ సీఎం జగన్ రాజీనామా చేయాలని విపక్షనేత చంద్రబాబు డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ పరీక్ష లీకేజీ వ్యవహారానికి బాధ్యతవహించి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సీఎం రాజీనామా చేస్తారో లేక పంచాయితీరాజ్, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. జరిగిన అవినీతి, అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేని చంద్రబాబు అన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గ్రామ సచివాలయ పరీక్ష నిర్వహణ అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్కు చంద్రబాబు లేఖ రాశారు. గత నాలుగు నెలలుగా జరిగిన పరిణామాలన్నీ ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాఖలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అనుక్షణం అప్రమత్తతతో ఉండాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు చంద్రబాబు. పరిపాలనకు అనుభవం ఎంత అవసరమో, కార్యదక్షత కూడా అంతే ముఖ్యమన్నారు. 4 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు.. సీఎం అనుభవ రాహిత్యం, చేతకానితనమే కారణమన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..