యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్‌ గోయెల్‌ పర్యటన

- September 24, 2019 , by Maagulf
యూఏఈలో భారత కేంద్ర మంత్రి పియూష్‌ గోయెల్‌ పర్యటన

భారత కేంద్ర మంత్రి పియుష్‌ గోయెల్‌, యూఏఈలో రెండు రోజుల పర్యటన కోసం విచ్చేశారు. ఆయనకు ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరమ్‌ యూఏఈ డెలిగేషన్‌ స్వాగతం పలికింది. దుబాయ్‌ ఎక్స్‌పో 202లో ఇండియా పెవిలియన్‌ని ఆయన ప్రారంభించారు. ఈ పర్యటన సందర్భంగా పియుష్‌ గోయెల్‌తో ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరమ్‌ యూఏఈ డెలిగేషన్‌ సమావేశమయ్యింది. ఐపీఎఫ్‌ ప్రెసిడెంట్‌, నేషనల్‌ కన్వీనర్‌ భూపేంద్ర కుమార్‌, ఐపీఎఫ్‌ యాక్టివిటీస్‌ గురించి వివరించారు. కాన్సుల్‌ వ్యవహారాలు, కల్చర్‌ ఎక్స్‌ఛేంజ్‌ వంటి విషయాలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఐపీఎఫ్‌ దుబాయ్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ మన్నాథ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జనగాం శ్రీనివాస్‌, ఐపీఎఫ్‌ షార్జా ప్రెసిడెంట్‌ విజయన్‌ నాయర్‌, జనరల్‌ సెక్రెటరీ సురేష్‌ కాశి, ఐపీఎఫ్‌ అజ్మన్‌ ప్రెసిడెంట్‌ రాధిష్‌ నాయర్‌, ఐపీఎఫ్‌ విమెన్‌ వింగ్‌ కో-ఆర్డినేటర్‌ శిల్పా నాయర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ విపుల్‌ మాట్లాడుతూ, ఐపీఎఫ్‌ టీమ్‌ సేవల్ని కొనియాడారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com