సబ్జాలతో మేలు
- September 26, 2019అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే సబ్జాను నీళ్లలో నానబెట్టి తాగండి. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయోటిక్ లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా సంబంధిత సమస్యలనూ నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల తెల్లవారేసరికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్-2 మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాదు..దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్ రాకుండా చూడడంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జా గింజలు పెట్టింది పేరు. ఇంకా ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోపాటు పీచునీ ఎక్కువగా కలిగివుంటాయి. ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్, నియాసిన్, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ 'ఇ' ఉంటుంది. శరీరంలో పేరుకున్న వ్యర్ధాలను తొలగించడానికి ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరింకేం..ఇప్పుడే ఒక గ్లాసుడు సబ్జాలను నాబెట్టండి..
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ